★SureshSoori Info★
♦గురువుల కొలువుల్లో ఎసరు..!
*🔸ఉపాధ్యాయులు..విద్యార్థుల నిష్పత్తి 1:30*
*🔹ఒకటీ రెండు రోజులలో ఉత్తుర్వులు*
*🔸స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు భారీగా కోత*
*🔸10 వేల ఎస్జీటీ పోస్టులు వృధా*
*🔹కొత్తగా పోస్టుల భర్తీ లేనట్టే*
*🔸డీఎస్సీ నిర్వహణ కష్టమే*
*🔹రేషనలైజేషన్ వల్ల సుమారు 15 వేల నుంచి 20 వేల ఉపాధ్యాయ పోస్టులకు ఎసరు పడుతోంది. ఫలితంగా కొత్తగా నియామక ప్రక్రియ కష్టమవుతుంది*
*🔹వచ్చే నెలలో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టను న్నట్లు ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. బదిలీల ప్రక్రియకు ముందుగానే రేషనలైజేషన్ ప్రక్రి యను పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది.*
*🍁ఇప్పటి వరకు 1 : 20 నిష్పత్తిలో విద్యార్థులు, ఉపాధ్యాయ పోస్టులుండగా, దానిని 1 : 30కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.*
*🔸ఈ విధానం ప్రకారమే ఉపాధ్యాయుల బదిలీల కంటే ముందుగానే రేషనలైజేషన్ చేసేందుకు రెండు మూడు రోజులలో మార్గదర్శకాలను జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.*
*🔹అందులో భాగంగానే జిల్లా విద్యాశాఖాధికారులతో విద్యాశాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.*
*🔸విద్యార్థులు, ఉపాధ్యాయుల కొత్త నిష్పత్తి వల్ల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పెద్ద ఎత్తున పోస్టులు మిగిలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఇంగ్లీషు మీడియం విద్య కోసం పట్టుబట్టిన జగన్ సర్కార్, ప్రస్తుతం హైస్కూళ్లలో ఉన్న ఇంగ్లీషు మీడియం విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయ పోస్టులకు కూడా కోత పెట్టే ఆలోచనలో ఉంది. ఈ విధానం వల్ల తెలుగు మీడియానికి బోధించే ఉపాధ్యాయులే ఇంగ్లీషు మీడియం వారికీ బోధించాల్సి ఉంది. దీంతో విద్యా ప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.*
*🔹రాష్ట్రంలో ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ యాజమాన్యాల పరిధిలో సుమారు 40 వేల ప్రాథమిక, ప్రాథమికోన్న, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా స్కూళ్లలో సుమారు మూడు లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా, రేషనలైజేషన్ కారణంగా సుమారు 15 వేల నుంచి 20 వేల పోస్టులకు గండం పొంచి ఉంది.*
*🔸ప్రాథమిక పాఠశాలల్లో ఐదో తరగతి వరకు విద్యార్థులకు పాఠాలు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు భారీగా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.*
*🔸రేషనలైజేషన్ ప్రక్రియపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని నాయకులు కోరుతున్నారు*
*🔸రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ఉపాధ్యాయుల బదిలీలలో భాగంగా చేపట్టే రేషనలైజేషన్ ప్రక్రియ మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభుత్వం రూపొందించినట్లు తెలుస్తోంది. 2017లో చేపట్టిన రేషనలైజేషన్కు, త్వరలో నిర్వహించనున్న రేషనలైజేషన్కు తేడా ఉందని, దీనివల్ల ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. అలాగే పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు మిగిలినట్టుగా చూపించి, వారిని సింగిల్ టీచర్స్ స్కూళ్లలో, మిగిలిన వారిని డీఈఓ పూల్స్లో ఉంచడం వల్లే గతంలో మాదిరిగా విమర్శలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.*
*🍁ఎస్జీటీగా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు..*
*🔹ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త విధానం వల్ల తక్కువ మహిళా అక్షరాస్యత (ఎల్ఎఫ్ఎల్) ఉన్న ప్రాంతాలలో హెచ్ఎం పోస్టులు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఉన్న చోట ఒక ఎస్జీటీ పోస్టును రద్దు చేసేలా నిబంధనలను అమలు చేయనుండటంపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.*
*🔹తాజా నిబంధనల ప్రకారం ఏదైనా ప్రాథమిక పాఠశాలలో కనీసం 150 మంది విద్యార్థులు మించి ఉంటేనే అదనంగా ఒక ఎల్ఎఫ్ఎల్ పోస్టును ఇవ్వనున్నారు. అంతకంటే తక్కువ మంది విద్యార్థులుంటే మాత్రం ఎస్జీటీ పోస్టును తగ్గించి, ఆ పోస్టులో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంను నియమించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.*
*స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) ఉపాధ్యాయులకు సరిసమానంగా ఉంటే ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంల గ్రేడ్ను తగ్గించే దిశగా ఆలోచన చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులను కొనసాగించాలని నాయకులు డిమాండు చేస్తున్నారు.*
*🔹ఎస్జీటీ పోస్టులను సర్దుబాటు చేయడం వల్ల రాష్ట్రంలో సుమారు 10 వేల పోస్టులు మిగిలిపోతాయని ఉపాధ్యాయ సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఆ మేర కొత్తగా ఎలాంటి ఉపాధ్యాయ నియామకాలకు ఎలాంటి డీఎస్సీ నిర్వహణ కష్టం*
*🔸హైస్కూల్స్లోనూ 1 : 40 నిష్పత్తిలో విద్యార్థులు, ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీనివల్ల ప్రధానంగా ఇంగ్లీషు మీడియం విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. హైస్కూళ్లలో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా తెలుగు, ఇంగ్లీషు మీడియం ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.*
*🔸విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఈఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఇంగ్లీషు మీడియంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలిసింది.*
*🔹విద్యార్థుల సంఖ్య ఆధారంగా స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టులను నియమించాలనే యోచనలో ఉండటం గమనార్హం.*
*🔸రేషనలైజేషన్ వల్ల కొత్తగా పోస్టులు మంజురు కావని ప్రభుత్వమే స్పష్టం చేసింది. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వ,ం పంచాయతీరాజ్శాఖ పరిధిలోని 7,774 సింగిల్ స్కూల్స్లో ఇకపై ఇద్దరేసి ఉపాధ్యాయులు ఉండనున్నారు.*
*🍁విద్యార్థి, ఉపాధ్యాయుల నియామకం ఇలా*
*🔸గతంలో ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయ పోస్టును మంజూరు చేయగా, తాజాగా దానిని ప్రతి 30 మందికి ఒక టీచర్ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.*
*🔹1-60 మంది విద్యార్థులున్న స్కూళ్లలో ఇకపై ఇద్దరు ఎస్జీటీ టీచర్లు ఉండనున్నారు.*
*🔸గతంలో 61-80కి ముగ్గురు ఎస్జీటీలుండగా, దానిని 61-90కు పెంచారు.*
*🍁91-120కి నలుగురు ఎస్జీటీలను నియమించనున్నారు.*
*🔸గతంలో 130 మంది విద్యార్థులు మించితే ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఉండగా, ఇకపై ఆ సంఖ్యను 150కి పెంచారు. అంతకంటే తక్కువగా ఉన్న స్కూళ్లలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంను ఎస్జీటీగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది.*
*🔹యూపీ స్కూళ్లలో కనీసం 20 మంది విద్యార్థులు ఉండాలి. 21-100 వరకు సంఖ్య ఉంటే నాలుగు ఎస్ఏ పోస్టుసలకు అవకాశం ఉండేది. ఇపుడు దానిని 1-100కు పెంచి నాలుగు ఎస్ఏ పోస్టులకు కుదించారు. అలాగే 6 నుంచి ఎనిమిది తరగతులున్న స్కూళ్లలో కనీసం 30 మంది ఉండాలి. 31-140 మధ్య విద్యార్థులుంటే ఆరు ఎస్ఏ పోస్టులకు అవకాశం ఉండగా, దానిని 1-140కు పెంచి ఆరు ఎస్ఏ పోస్టులకే పరిమితం చేశారు.*
*🔹హైస్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులు ఇలా*
*1-240 మంది విద్యార్థులకు 9 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు*
*241-280 మధ్య ఉంటే 12 ఎస్ఏ పోస్టులు (అదనంగా గణితం, ఇంగ్లీషు, తెలుగు)*
*281-320 మద్య ఉంటే 13 ఎస్ఏ పోస్టులు (అదనంగా హిందీ)*
*321-400 విద్యార్థులకు 16 ఎస్ఏ పోస్టులు (అదనంగా పీఎస్, బీఎస్, సోషల్)*
*401-440 విద్యార్థులకు 17 ఎస్ఏ పోస్టులు (అదనంగా పీడీ పోస్టు)*
*441-520 విద్యార్థులకు 20 ఎస్ఏ పోస్టులు, ఒక క్రాఫ్ట్ లేదా డ్రాయింగ్ (అదనంగా గణితం, తెలుగు, క్రాఫ్ట్)*
*521-600 వరకు 23 ఎస్ఏ పోస్టులు*
*601-640 మధ్య విద్యార్థులుంటే 24 ఎస్ఏ పోస్టులు (అదనంగా బీఎస్ పోస్టు)*
*641-680 మంది విద్యార్థులకు 27 ఎస్ఏ పోస్టులు (అదనంగా ఇంగ్లీషు, తెలుగు, హిందీ పోస్టులు)*
*681-720 విద్యార్థులకు 28 ఎస్ఏ పోస్టులు (అదనంగా గణితం)*
🍃🍁🍃🍁🍃🍁🍃🍁
0 Comments