Recents in Beach

💥 యూజీ, పీజీ పరీక్షలకు రెడీ!

                    ★SureshSoori Infoo★


♦యూజీ, పీజీ పరీక్షలకు రెడీ!

యూజీసీ మార్గదర్శకాలతో చివరి సెమిస్టర్‌పై సర్కారు యోచన

వారంలోగా నిర్ణయం ప్రకటించే అవకాశం

★రాష్ట్రంలో సంప్రదాయ యూజీ, పీజీ కోర్సులతోపాటు ప్రొఫెషనల్‌ కోర్సులకు సంబంధించిన చివరి సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

 ★చివరి సెమిస్టర్‌ పరీక్షలు సెప్టెంబరు నెలాఖరులోగా నిర్వహించాలన్న యూజీసీ

 🔸తాజా మార్గదర్శకాల నేపథ్యంలో ఈ దిశగా యోచిస్తోంది.

★కరోనా విస్తృతి నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహించడం అనివార్యంగా భావిస్తోంది. ఈ అంశంపై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మరోసారి వర్సిటీల వైస్‌చాన్సెలర్ల అభిప్రాయాలను తీసుకుని, నిర్ణయం తీసుకోనుందని సమాచారం. అయితే, రాష్ట్రంలో కరోనా విస్తృతి నేపథ్యంలో పరీక్షలను ఆఫ్‌లైన్‌లో నిర్వహించడం ఎంతవరకు సాధ్యమన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్‌లైన్‌లో నిర్వహిస్తే.. అవసరమైన సదుపాయాలను వర్సిటీలు సమకూర్చగలవా? అన్న సందేహాలు కూడా లేకపోలేదు.

 ★ఇటీవల యూజీ, పీజీ సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఉన్నత విద్యా మండలి నిర్వహించిన సమావేశంలో.. పరీక్షల నిర్వహణ అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమైంది.

★దీంతో ఇదే విషయాన్ని మండలి సీఎం దృష్టికి తీసుకెళ్లగా సమగ్ర సమాచారంతో రావాలని ఆయన ఆదేశించారు. కానీ ఆతర్వాత సమావేశం జరగలేదు.

★మరోపక్క.. ఎంసెట్‌ నిర్వహణకు సంబంధించి ఉన్నత విద్యా మండలి సీఎంతో చర్చించి ఓ ప్రకటన చేయాలని భావిస్తోంది.

 ★షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 27 నుంచి 31 వరకు ఎంసెట్‌ జరగాలి. అలాగే ఈ నెల 24 నుంచి ఈసెట్‌తో ప్రారంభమై ఇతర ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

 ★వారంలోగా యూజీ, పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షలతోపాటు సెట్స్‌ నిర్వహణపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

★యూజీసీ నిర్ణయంపై విద్యార్థుల ఆందోళన

★యూజీ, పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షలు సెప్టెంబర్‌లోగా నిర్వహించాలన్న యూజీసీ నిర్ణయంపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

 ★చివరి సంవత్సరం/సెమిస్టర్‌ పరీక్షలను రద్దు చేసి గత సెమిస్టర్‌ల మార్కుల సరాసరి ఆధారంగా పాస్‌ చేయాలని కోరుతున్నారు. తర్వాత కావాలంటే బెటర్‌మెంట్‌ మార్కుల కోసం పరీక్షలు పెట్టి రాసుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.

 ★మహరాష్ట్రసహా పలు రాష్ట్రాల్లో పరీక్షలను ఐచ్ఛికంగా తీసుకుని ప్రభుత్వం తీర్మానం చేసిన తర్వాత చాలామంది ఉపశమనం పొందారు.*

 ★ఇప్పుడు యూజీసీ నిర్ణయంపై ఆందోళన చెందుతున్నారు. యూజీసీ నిబంధనలు కేవలం మార్గదర్శకాలేనని, అవి తప్పనిసరి కావని అంటున్నారు.

★ఐఐటీలు, ఎన్‌ఐటీలు పరీక్షలను రద్దు చేసినప్పుడు ఇక్కడ ఎందుకు చేయరని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తే ఇబ్బందులు ఉండవని మరికొందరు అంటున్నారు.

#ApUGPG #Final Exams 

Post a Comment

2 Comments

  1. పరీక్ష లు రాయగలం కానీ ఇతర రాష్ట్రాల్లో కి వచ్చి ఇబ్బంది పడలేం.. కధ సర్ కొందరు తెలంగాణా లో చదివే విద్యార్థులు ఆంధ్ర లో చదివే తెలంగాణ విద్యార్థులు ఉన్నారు వాళ్ళు పరిస్థితి ఏమిటి సర్...ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసాంఅంటారుకానీ ఏం ఉండవు తరవాత వచ్చే ఇబ్బందులు ఎదుర్కొంనేది మేమే.. సర్...

    ReplyDelete
  2. పరీక్ష లు రాయగలం కానీ ఇతర రాష్ట్రాల్లో కి వచ్చి ఇబ్బంది పడలేం.. కధ సర్ కొందరు తెలంగాణా లో చదివే విద్యార్థులు ఆంధ్ర లో చదివే తెలంగాణ విద్యార్థులు ఉన్నారు వాళ్ళు పరిస్థితి ఏమిటి సర్...ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసాంఅంటారుకానీ ఏం ఉండవు తరవాత వచ్చే ఇబ్బందులు ఎదుర్కొంనేది మేమే.. సర్...

    ReplyDelete